GNTR: వ్యక్తి అదృశ్యంపై గుంటూరు పట్టణంలోని లాలాపేట పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేట రొట్టెల బజారుకు చెందిన పులుగుమూటు శంకర్రావు అనే వ్యక్తి వేరుశనగలు విక్రయిస్తూ జీవిస్తున్నాడని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శంకర్రావు ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఈ నెల 12న ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని అన్నారు.