W.G: తణుకు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను మంగళవారం MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్ల నిర్వహణ, ఆర్వో ప్లాంట్ పనితీరును స్వయంగా పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరీక్షించారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.