మార్కాపురం జిల్లా బస్సు ప్రమాదంలో కనిగిరి చెందిన తల్లి కొడుకును వేరు చేసిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ముందు కుమారుడైన మనోహర్ను బస్సు బయటకి తోసివేసి తర్వాత బయటకు దూకేందుకు ప్రయత్నించిన తల్లి రమాదేవి చివరికి మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతి అయ్యింది. కళ్ల ముందే తల్లి దహనమవుతుంటే కాపాడుకోలేని దురదృష్టవంతుణ్ణి అంటూ రోదిస్తున్నఆ యువకుడి బాధ వర్ణానాతీతంగా మారింది.