NDL: అవుకు పట్టణంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. నూతనంగా ఏర్పాటు చేసిన గౌడ కమ్యూనిటీ హాల్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం గౌడ కులస్తులు ఎల్లప్పుడూ ఐకమత్యంగా కలిసి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.