PPM: ఎవరైనా ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాలూరు తహసీల్దార్ సురేశ్ హెచ్చరించారు. గురువారం మామిడిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. వెంగళరాయ సాగర్ కార్యాలయం ఎదుట పలువురు ప్రభుత్వ స్థలంలో పాన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు గమనించి, తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.