TPT: శరన్నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణం పటేల్ వీధిలో మంగళవారం రెండో రోజు దుర్గాదేవి అమ్మవారు గాయత్రి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉప పీఠాధిపతి కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గాయత్రీ అమ్మవారి మంత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం శ్రీ విజయ దుర్గ అమ్మవారి హోమం, పల్లకి సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.