మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన నాసరయ్య థాయిలాండ్లో ప్రపంచ స్థాయి మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. 100 మీటర్ల పరుగులో గోల్డ్, 5000 మీటర్ల వాక్ రేస్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. తండ్రి మరణించిన ఆరు నెలల్లోనే థాయిలాండ్కు వెళ్లే అర్హత సాధించాడు. తన తండ్రిలేని లోటును తీర్చుకుంటూ తల్లి ప్రోత్సాహంతో థాయిలాండ్ చేరాడు.