KRNL: తుగ్గలి మండలంలోని జొన్నగిరి బాలుర వసతి గృహాన్ని జిల్లా ఎండోమెంట్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో విశ్వమోహన్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న డొక్కా సీతమ్మ మెనూ భోజనం, వంటగది, గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాన్ని శుభ్రంగా నిర్వహించి బాలురకు అవసరమైన సౌకర్యాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు.