SKLM: నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉపాధ్యాయులు హాల్ టికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ దేవత చరణాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని అమ్మవారికి మొక్కుకున్నారు.