VZM: రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎల్.కోట మండలం గంగుబూడిలో ఉంటున్న ఆయన అత్త జి వెంకటలక్ష్మి శుక్రవారం మృతి చెందారు. ఎమ్మెల్యే లలిత కుమారి శనివారం ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TDP కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.