ప్రకాశం: కొమరోలు MPDO కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO చెన్నయ్య తెలిపారు. MPP కామూరి అమూల్య అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ముఖ్యఅతిథిగా గిద్దలూరు MLA అశోక్ రెడ్డి పాల్గొంటున్నారని, అధికారులు తమ శాఖ నివేదికలతో హాజరుకావాలని పేర్కొన్నారు.