W.G: భీమవరం పట్టణంలోని 39,38,37,34,33 వార్డులలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మార్చి 29న టీడీపీని ప్రకటించినందున ఆవిర్భావ దినోత్సవం వారం రోజులు ముందుగానే నియోజకవర్గంలోని జరుగుతున్నాయని తెలిపారు.