SKLM: పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని MPDO వాసుదేవరావు సూచించారు.