SKLM: శ్రీముఖలింగం బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ సభ్యులు సోమవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ను కలిసి నవంబర్ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలియాత్ర విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.