అనంతపురంలోని 40వ డివిజన్ ఆజాద్ నగర్ హసేన్ మసీదు వద్ద సోమవారం మహబూబ్ ఖాన్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ మాసం శాంతి, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.