విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రెడ్డి సతీష్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ కార్యాలయాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో శాశ్వత భవనాలు కేటాయించాలని ఆయన కలెక్టర్ను కోరారు. అలాగే జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.200 కోట్లకు పైగా లైబ్రరీ సెస్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.