ప్రకాశం: కార్తీక మాసంలో పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16వ తేదీల్లో రాత్రి 9 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.