తూ.గో: అల్లవరం మండలం మొగళ్లమూరులో కొలువై వున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ హనుమంత్ వ్రత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమె వెంట స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.