KRNL: వినాయక చవితి సందర్భంగా కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో వినాయకున్ని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు. మేయర్ బీవై రామయ్య, కమిషనర్ పీ.విశ్వనాథ్ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించి శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షించారు.