SKLM: కోటబొమ్మాలి మండలం జర్జంగి గ్రామానికి చెందిన హనుమంతు జగన్నాథ్ దొర (హెచ్జె దొర) అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా, ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా విధులు నిర్వహించారు.