VZM: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం కురుపాం కోర్టుకు సంబంధించి పార్వతీపురం కోర్టులో లోక్ అదాలత్ చైర్మన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోసఫిన్ ఆధ్వర్యంలో 54 కేసులను పరిష్కరించారు. ఇందులో ఎక్సైజ్ శాఖకు సంబంధించి 22 కేసులు, ఐపిసికి సంబంధించి నాలుగు కేసులు, పిఎల్సికి సంబంధించి రెండు కేసులు, ఎస్టిసికి సంబంధించి 26 కేసులను పరిష్కరించారు.