కర్నూలు: ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలోని ZP ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి కీర్తనపై దాడి చేసిన ఎంఈవో-2 మధుసూదన న్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పర్యవేక్షణకు వెళ్లిన ఎంఈవో.. విద్యార్థినిని అందరి ముందు చెంప, వీపుపై కొట్టడం సరైన వైఖరి కాదని మండిపడ్డారు.