W.G: తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రెస్క్లబ్ నూతనంగా ఏర్పాటైంది. మంగళవారం స్థానిక కార్యాలయంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కమ్ముల రాయుడు, ప్రధాన కార్యదర్శిగా కట్టుంగ శ్రీను ఎన్నికయ్యారు. మరో పది మంది సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.