కోనసీమ: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యనిష్ఠ, ఆదర్శ నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. శ్రీరాముని జీవితం మనిషి ఎలా ఉండాలో చూపించే ఆదర్శమూర్తి జీవితమన్నారు.