GNTR: రాజధాని అమరావతిలో రూ. 210 కోట్లతో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలను సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా, హైకోర్టు అతిథి గృహం, జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.