GNTR: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.