VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతంపై సమావేశం జరిగింది. శనివారం సీతమ్మధారలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వార్డు, సచివాలయ కమిటీలు త్వరగా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.