సత్యసాయి: ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన 70 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు వేసి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తిమ్మయ్య, నారాయణ స్వామి, సూర్యనారాయణ, మణికంఠ పాల్గొన్నారు.