కృష్ణా: ఉలవలపూడి గ్రామంలో స్వచ్ఛ రథం గురువారం పర్యటించింది.గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. గ్రామస్తులు ఇంటింటా పేరుకుపోయే పనికిరాని ప్లాస్టిక్, ఇనుము, పేపర్ స్క్రాప్ వంటి వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందించారు. ఇలా చేయడం వల్ల గ్రామం శుభ్రంగా ఉండడమే కాకుండా, అందించిన స్క్రాప్కు బదులుగా నిత్యవసర సరుకులు పొందవచ్చని అధికారులు తెలిపారు.