ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హిరేహాల్ మండలంలోని మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి పురోహితులు పవన్ కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారికి పంచామృతం, కుంకుమ అర్చనలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర రాష్ట్రం నుంచి సైతం భక్తులు పాల్గొని, దర్శించుకున్నారు.