తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అసాంఘిక శక్తులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలనే లక్ష్యంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, పేకాట, చైన్ స్నాచింగ్, జూదం తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నేరాలు నియంత్రిస్తున్నామని పోలీసు అధికారులు ప్రకటించారు.