GNTR: టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల కరపత్రాన్ని ఎమ్మెల్యే మాధవి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు యువతకు ఉత్తమ స్ఫూర్తిని అందిస్తాయని, ధర్మం, నైతిక విలువలపై వారికి మంచి అవగాహన కలిగిస్తాయని తెలిపారు.