SS: పెనుకొండ పట్టణ సమీపంలోని గోనిపేట రోడ్డులో ఉన్న దర్గాకు సంబంధించిన పీఠాధిపతులు, కమిటీ సభ్యులు మంత్రి సవితను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న జరగనున్న వార్షిక గంధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ పెనుకొండలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.