VSP: అక్కిరెడ్డిపాలెం డ్రైనేజీ మీదుగా పోర్ట్ అథారిటీ నిర్మించనున్న గిడ్డంగుల వల్ల డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బ తినకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పోర్ట్ ట్రస్ట్ ఇంజినీరింగ్ అధికారి వేణు ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ముందుగా పక్కా డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు.