విశాఖపట్నం నుంచి ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీగా బయల్దేరారు. జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వాహనాల్లో మూలపేటకు ప్రయాణమయ్యారు. ఈ ర్యాలీలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.