SKLM: పలాస మండలం శాసనామ్ గ్రామంలో ఎమ్మెల్యే గౌతు శిరీష జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 92.40 లక్షల నిధులతో ఇంటింటికీ మంచి నీటి సరఫరా పనులకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు ఆమెకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా గ్రామానికి మంచినీరు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు.