గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు బుధవారం పర్యటించారు. చిన్నపాటి వర్షానికే వార్డుల్లో నీరు నిలుస్తుండటం, కాల్వల్లో పూడికలు తీయకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి కొద్ది రోజుల్లో సమస్యలు తీరుస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.