VSP: జీవీఎంసీ 50వ వార్డు సాయిరాం నగర్లో గురువారం సాయంత్రం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ పాల్గొని పలు సూచనలు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారం చేపట్టేందుకు కృషి చేయాలన్నారు.