GNTR: కుంచనపల్లి హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం సందర్శించారు. లక్ష్మీ నరసింహస్వామి హోమంలో పాల్గొన్నారు. అనంతరం రాధా కృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇస్కాన్ ప్రతినిధుల ఆశీర్వచనాలు అందుకున్నారు. చివరిగా భక్తులకు భగవద్గీత పుస్తకాలను ఎమ్మెల్యే మాధవి పంపిణీ చేశారు.