SKLM: పలాస మండలం నీలిపద్ర గ్రామంలో మంగళవారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబు రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి విఠల్ రావు హాజరై రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిందన్నారు.