SKLM: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా తీరని అన్యాయం చేస్తుందని రెల్లి కుల సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. సోమవారం నరసన్నపేటలోని స్థానిక పురుషోత్తం నగర్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12 వర్గాలకు చెందిన ఎస్సీ వర్గీకరణలో భాగంగా కేవలం మహిళలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని అన్నారు.