ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీకు ఉన్న ఫాలోయింగ్ ఒక బాధ్యత అని, దానిని ప్రజల భద్రత, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే మీరు నిజమైన “డిజిటల్ వారియర్స్” అవుతారన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, మహిళలు, బాలికల భద్రత, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.