NZB: చందూర్ మండల కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, మైనారిటీ సభ్యులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో హనుమాన్ మాలధారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, వీడీసీ ప్రెసిడెంట్ బొట్టే శంకర్, మాజీ ఉప సర్పంచ్ శేఖర్, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి రాంరెడ్డి పాల్గొన్నారు.