సత్యసాయి: విజయవాడలో గురువారం రాత్రి జరిగిన ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. జావెలిన్ త్రో పోటీలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా నిలిచారు. టెన్నిస్ డబుల్స్, టికిల్ బాల్ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి బరిలోకి దిగి విజయం సాధించారు.