CTR: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కారు బోల్తా కొట్టింది. పలమనేరు మండలం గాంధీనగర్ సమీపంలో కారు అదుపు తప్పిన కారు 30 అడుగులు ఎగిరి పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ గాయాలు లేకుండా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం అయినప్పటికీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.