VPS: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా బీచ్ రోడ్లోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆయన జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, మూడవ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు.