అన్నమయ్య: వాయల్పాడు మండలం చింతపర్తి ప్రభుత్వ డాక్టర్ సాయిశ్రీ, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు సోమవారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మొదటి సంతానం ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను స్వయంగా చాటిచెప్పాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.