ATP: అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం అఖిల భారత మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు గుజరాత్లోని సూరత్కు వెళ్లారు. నేడు, రేపు 116వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం సూరత్లో జరుగుతుంది. ఈ సందర్భంగా మేయర్ల కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు. కార్పొరేషన్ల అభివృద్ధి, మేయర్ల బాధ్యతలపై సమావేశంలో చర్చిస్తారు.