SKLM: లావేరు(M) బుడుమూరు వద్ద హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్ సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఐదు హోటళ్లలో గృహ వినియోగ LPG సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 14 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యజమానులపై రూ.35,510 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.