ASR: ప్రతీ ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని డీఎంహెచ్వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు, పాడేరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి పిలుపునిచ్చారు. శనివారం 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నుంచి సర్వజన సాధారణ ఆసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై ఉన్న అపోహలు తొలగించాలన్నారు.